వైసీపీ చెత్త ప్రభుత్వం..
85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలేసింది..!
========================
నెల్లూరు అల్లీపురం డంపింగ్ యార్డ్ లో చెత్త తొలగింపు కార్యక్రమానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. 23 కోట్ల 88 లక్షల రూపాయలతో చెత్తను ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను విధించి, చెత్త ప్రభుత్వంగా మిగిలిపోయిందని, ప్రజలపై చెత్త పన్ను విధించి 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తమ ప్రభుత్వానికి అంటగట్టి పోయిందని ఎద్దేవా చేశారు. రానున్న ఆరు నెలల్లో డంపింగ్ యార్డ్ లో పూర్తిస్థాయిలో చెత్త తొలగించి గ్రీనరీని ఏర్పాటు చేస్తామన్నారు. చెత్తతొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రినారాయణకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA