వేణు స్వామి అనే వ్యక్తి సినీ పరాన్నజీవిగా మారి యూ ట్యూబ్ ఛానెళ్లతో తన మార్కెట్ పెంచుకున్నారు. ఇలాంటి అనేక మంది అదే వ్యాపారంలో ప్రజల్ని నిలువునా దోపిడీ చేస్తున్నారు.
మూఢనమ్మకాలను వ్యాప్తి చేసే ఇలాంటి వాళ్ల నుంచి అలర్ట్ చెయ్యడం ఈ చర్చ ఉద్దేశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ప్రకారం సైంటిఫిక్ టెంపర్ పొందొందేలా చెయ్యడం ప్రతి పౌరుడి విధి. ఆ విధిలో భాగంగానే అసత్య ప్రచారాలు, మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తున్న వాళ్ల గురించి చైతన్యం కలిగించేందుకు ప్రముఖ హేతువాది బాబు గోగినేని నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. ఈ ఛానెల్ ప్రధాన ఉద్దేశం హేతుబద్దమైన సమాచార వ్యాప్తి. ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పించడం. ఈ చర్చ మొత్తం చూస్తే కేవలం జాతకాలు చెప్పే వాళ్లపట్ల ఎలాంటి వైఖరి ఉండాలన్నది మాత్రమే కాకుండా, వాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై అవగాహన పెరుగుతుంది. ఈ చర్చలో ప్రేక్షకులు పోస్ట్ చేసిన ప్రశ్నలకు బాబు గోగినేని సమాధానం చెబుతారు.