#Raitunestham #DrKhaderVali
బియ్యం, గోధుమలను ఆహారంగా తీసుకోడం ఎక్కువ అయ్యాకే బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు అధికమయ్యాయని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి తెలిపారు. సంప్రదాయ చిరుధాన్యాలు, ఆకుల కషాయాలు, ప్రకృతి జీవన విధానాలతో ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని స్పష్టం చేశారు.
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్ఖానాలోని వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో... ఏప్రిల్ 16న సికింద్రాబాద్ కార్ఖానాలోని వాసవి నగర్ లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సు జరిగింది.
ఈ సదస్సులో పాల్గొన్న ఖాదర్ వలి... ఆహారం - ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు... వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ ముర్కి చంద్రకాంత్ తదితరలు పాల్గొన్నారు.
-------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -https://youtu.be/Q2sMoy7KKuw
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.com/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham
☛ Follow us on - https://twitter.com/rythunestham1